Header Banner

Fastag: ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు!

  Wed Jun 18, 2025 13:41        Politics

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తరచూ టోల్‌ రోడ్డు వారే వాడికి అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్‌ ట్యాగ్‌పై కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్‌ చేసుకుని యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులు వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తూ కొత్త విధానం తీసుకువచ్చింది కేంద్రం. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. వాణిజ్యేతర, వ్యక్తిగత వాహన దారులు ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ఈ పాస్ ప్రత్యేకంగా రూపొందించారు.


ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!


భారత టోల్ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా డిజిటల్ రూపంలో టోల్ టాక్స్ కలెక్ట్ చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్‌ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా, ఖర్చుతో కూడుకున్న ప్రయాణాన్ని అనుమతిస్తుంది.

వార్షిక పాస్ యాక్టివేషన్, రెన్యూవల్‌ కోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో అలాగే NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ విధానం 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి దీర్ఘకాలికంగా వాహనదారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకేసారి రీఛార్జ్ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం టోల్ ప్లాజాల వద్ద వివాదాలను తగ్గించడం ద్వారా, లక్షలాది మంది ప్రైవేట్ వాహన వాహనదారులు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా వార్షిక పాస్ ఉపయోగపడనుంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఎక్కువగా టోల్‌ రోడ్లలను వినియోగించే వారు ఈ ప్లాన్‌ తీసుకోండి.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..

 

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FASTagUpdate #CentralGovernment #HighwayToll #DigitalIndia #FASTagMandatory #TransportNews #IndiaRoadways #August15